దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నగరాలను, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తిరుపతి విమానాశ్రయం, తిరుపతి, అలిపిరిలోని హోటళ్లకు మెయిల్స్ వచ్చాయి. దీంతో స్థానికులతో పాటు తిరుమలకు దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా తిరుపతిలో మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరుసగా పలు హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.ఏకంగా గ్యాస్, వాటర్ పైపులైన్లు, మురుగునీటి పైపుల్లో పేలుడు పదార్థాలు ఉంచామని దుండగులు బెదిరించారు. తాజ్, బ్లిస్, మినర్వా, చక్రి, పాయ్ వైస్రాయ్, రీనెస్టు, గోల్డెన్ దులిఫ్, రమీ గెస్ట్లో లైన్ హోటళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో డీఎస్పీ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు, డాగ్, బాంబు స్క్వాడ్లు హోటళ్లను తనిఖీ చేసి ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చారు.