ఏపీలో మహిళలు, చిన్నారులపై వరుస దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పలు ఘటనల్లో చిన్నారులు, యువతులు మృతి చెందగా తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పురానికి చెందిన ఓ మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దారుణం వెలుగు చూసింది. పాపను నాగరాజు అలియాస్ సుశాంత్ అనే వ్యక్తి చాక్లెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. పాపపై అత్యాచారం చేసి హత్య చేసి పూడ్చిపెట్టాడు. విచారణలో యువకుడు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు పాపను పూడ్చిపెట్టిన స్థలానికి వెళ్లారు.నిందితుడు నాగరాజు అదుపులోకి తీసుకున్నారు.