ఏపీలో మహిళలు, బాలికలపై వరుస అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల పలు ఘటనల్లో కామాంధులు యువతులు, చిన్నారులపై అత్యాచారాలు చేసి ప్రాణాలు తీశారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్నా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా తిరుపతి జిల్లాలో మరో బాలికపై అఘాయిత్యం జరిగింది. యర్రావారిపాలెం మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. మత్తు కలిపిన నీటిని బలవంతంగా తాగించి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. పొదల్లోంచి మూలుగుతున్న శబ్దం విన్న స్థానికులు బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.