తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో ఆందోళన నెలకొంది. అకస్మాత్తుగా విమానం రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు విమానం వచ్చింది.ఈ విమానం ఉదయం 8.15 గంటలకు హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే ప్రయాణికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అధికారులు విమానాన్ని రద్దు చేశారు. ప్రయాణ సమయానికి చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 45 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు.