ఏపీ అసెంబ్లీలో సోమవారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం బడ్జెట్ పై స్పీకర్ అయ్యన్న పాత్రులు అధ్యక్షతన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం ప్రారంభించారు. కొత్త ఎమ్మెల్యేలకు బడ్జెట్పై అవగాహన, అసెంబ్లీ కార్యక్రమాలను స్పీకర్, ఇతర సీనియర్ నేతలు వివరించారు.నేడు ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశం, కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. నేడు ప్రభుత్వ చీఫ్ విప్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం.