రాజ‌మౌళి సినిమా కోసం బాలీవుడ్ భామ‌కు భారీ రెమ్యున‌రేష‌న్‌

స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో ప్రిన్స్ మ‌హేశ్ బాబు హీరోగా ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపుదిద్దుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు వ‌ర్కింగ్ టైటిల్ ఎస్ఎస్ఎంబీ29 గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇండియా వైడ్‌గా భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మ‌హేశ్‌బాబుకు జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సెట్స్ వెతుకుతూ రాజ‌మౌళి ప‌లు ఫోటోలు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్రియాంకా చోప్రా బాలీవుడ్ నుంచి ఎప్పుడో హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలో భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌మౌళి సినిమా కోసం ప్రియాంకా ఏకంగా రూ.20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓ న్యూస్ ప్ర‌చారంలో ఉంది. అయితే హాలీవుడ్‌ మీడియా మాత్రం ప్రియాంక ఈ సినిమా కోసం రూ.40 కోట్ల‌ వరకు తీసుకుంటుంద‌ని రాస్తున్నారు. ఇక నిజం తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. ఇటీవ‌లే ఈ సినిమా కోసం ప్రియాంక హైద‌రాబాద్‌లో అడుగుపెట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *