హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజేంద్రనగర్ , మణికొండ ప్రాంతాల్లో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురు యువకులు, ఓ చిన్నారి మృతి చెందారు. వివరాళ్లోకి వెళ్తే… మంగళవారం ఉదయం ఆరాంఘర్ ఫ్లైఓవర్పై ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తున్నారు. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్దకు రాగానే బైక్ డివైడర్ను ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులను బహదూర్పురాకు చెందిన వారిగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
మణికొండలో చిన్నారి…
మణికొండలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కుమార్తెను బడిలో దించేందుకు స్కూటీపై వెళ్తుండగా లారీ వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో లారీ కింద పడి కుమార్తె అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రికి స్వల్ప గాయాలవగా అతడిని ఆస్పత్రికి తరలించారు.