ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో కేటీఆర్పై విచారణ సైతం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా పోతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయేలా చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.