స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ, అంజలి నటించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బొక్క బోర్లా పడింది. అంజలి నటించిన మరో సినిమా మద గజ రాజా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో బాగా మరో నటి వరలక్ష్మితో అంజలి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ క్రమంలో రిపోర్టర్ గేమ్ ఛేంజర్ ఫలితం ఎలా అనిపించిందని ప్రశ్నించారు. నటిగా తన వంతుగా రెండు వందల శాతం ఎఫర్ట్ పెట్టానని, కొన్ని సార్లు సినిమా ఫలితం బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. అయితే సినిమా బాగా లేదని తనకు ఎవరూ చెప్పలేదని, తన పాత్ర బాగుందని, తను మంచి సినిమాలో నటించానని అందరూ మెచ్చుకున్నారని తెలిపింది.