హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర పోలీసులు షాకిచ్చారు. ఇటీవల జరిగిన బతుకమ్మ వేడుకల్లో నిషేధిత డీజేలు వినియోగించడంపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ నెల 10న బంజారాహిల్స్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ పాల్గొన్నారు. రోడ్డు నెంబర్ 12లోని ఎన్బీనగర్ లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి అయినా డీజేలతో మోత మోగించారు. పోలీసులు అక్కడికి చేరుకొని డీజే ఆపేందుకు ప్రయత్నించగా మహిళలు ఆడుతున్న బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారని మేయర్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు ప్రోగ్రాం మేనేజర్ విజయ్ కుమార్, డీజే సౌండ్స్ మేనేజర్ గౌస్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇటీవల డీజేపీ నగర సీపీ ఆనంద్ కుమార్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.