తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ కార్డులు, రేషన్ షాపులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ ఓ లేఖ రాశారు. తెలంగాణలో రేషన్కార్డులపై, రేషన్ షాపుల వద్ద ప్రధాని మోడీ ఫోటో పెట్టాలని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అర్హులందరికీ రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన నాలుగు పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా ప్రజలకు అందడం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.