ట్రావెల్స్ బ‌స్సును ఢీకొన్న లారీ.. 40 మందికి గాయాలు

జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెట్స్ బ‌స్సును లారీ ఢీకొన‌డంతో బ‌స్సులోని 40 మంది ప్ర‌యాణికుల‌కు గాయాల‌య్యాయి. ఉండవల్లి మండలంలో శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వివ‌రాళ్లోకి వెళ్తే… రాళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుంచి కడపకు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బ‌స్సును ఢీకొట్టింది. దీంతో బ‌స్సులోని ప్ర‌యాణికులు గాయాల‌పాల‌య్యారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *