ఐర్లాండ్‌లో యాక్సిడెంట్‌.. ఇద్ద‌రు ఏపీ యువ‌కులు మృతి

ఐర్లాండ్‌లో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు యువ‌కులు ప్రాణాలు కోల్పోయాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండ‌లం చెందిన గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్‌, పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్లారు. ఈ క్ర‌మంలో శుక్రవారం రాత్రి త‌మ‌ స్నేహితులతో కలిసి కారులో బ‌య‌ట‌కు వెళ్లారు. ప్ర‌మాద‌వ‌శాత్తు వీరు ప్ర‌యాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో భార్గ‌వ్, సురేష్‌ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. కారు యాక్సిడెంట్‌లో వీరు మ‌ర‌ణించిన‌ట్లు భార్గ‌వ్ తండ్రి సాయిబాబాకు స‌మాచారం అందింది. దారి పొడ‌వునా కురుస్తున్న మంచు కార‌ణంగానే రోడ్డు ప్ర‌మాదం జరిగిన‌ట్లు మృతుల స్నేహితులు వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *