జ‌గిత్యాల‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. మ‌హిళా ఎస్సై మృతి

జగిత్యాల జిల్లాలో ఘోర‌ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ మ‌హిళా ఎస్సై ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళ్తే… జగిత్యాల పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో శ్వేత ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆమె మంగ‌ళ‌వారం త‌న కారులో ధ‌ర్మారం నుంచి జ‌గిత్యాల వెళ్తున్నారు. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఆమె కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఆ త‌ర్వాత కారు రోడ్డు ప‌క్క‌న ఉన్న‌ చెట్టును బ‌లంగా ఢీకొట్టింది.ఈ ప్ర‌మాదంలో ఎస్సై శ్వేత‌తో పాటు, మ‌రో యువ‌కుడు మృతి చెందారు. ఎస్సై మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *