భారత ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం మోడీ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం మోడీ ముందుగా ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి అరైల్ ఘాట్కు వెళ్లి బోటులో మహా కుంభమేళాకు చేరుకుంటారు. పుణ్యస్నానం, పూజల అనంతరం బోటులో తిరిగి అరైల్ ఘాట్కు వెళ్లి ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తారు.ఈ పర్యటనలో ప్రధాని వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఉండనున్నారని తెలుస్తోంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.