నార్సింగిలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న పిల్లి గణేష్ను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గణేష్ బంధువులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.