కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ బైక్ డివైడర్ను ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో యువతి తీవ్రంగా గాయపడింది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని రహదారిపై శ్రీకృష్ణ మందిరం వద్ద తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న అనంత్(23)తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనకాల కూర్చున్న మరో యువతి సంజన (22) తలకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్, సంజనలు హైదరాబాద్లోని ఈసీఐఎల్కు చెందిన వారిగా గుర్తించారు. సంజనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.