తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. మాజీ మంత్రి హరీష్ రావు పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును కొట్టి వేస్తూ హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హరీశ్రావుతో పాటు రాధాకిషన్రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. ఈ కేసుపై వాదనలు ముగియగా నేడు కోర్టు కేసును కొట్టి వేసింది.