కొందరు ఎమ్మెల్యేలు దొంగల్లా అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ కొందరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. సభ్యులు ప్రశ్నలు అడిగి సమాధనం వినేందుకు సభకు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది ఇలా దొంగల్లా వచ్చి అసెంబ్లీలో సంతకం పెట్టి వెళ్లిపోయేందుకా అని నిలదీశారు. ఇది గౌరవప్రదం కాదని సూచించారు. కాగా ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాథ రెడ్డి, విశ్వేశరరాజు, తదితరులు సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.