రాష్ట్రంలోని రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ విమర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను జగన్ పరామర్శించారు.
వైయస్ఆర్ జిల్లాలోని తాతిరెడ్డిపల్లిలో పంటలను పరిశీలించి రైతులతో వైయస్ జగన్ మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పంటకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారని, సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదని పేర్కొన్నారు.రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, రానున్న రోజుల్లో రైతుల ముఖాల్లో చిరునవ్వు కోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.