హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెలవుల్లో నగరాన్ని చూసేందుకు వచ్చిన ఓ యువతిని బెదిరించి కొందరు దుర్మార్గులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు యువకులు మీర్పేట్ వద్ద ఓ విదేశీ యువతిని లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, ఆమెను పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత యువతి జర్మనీ దేశానికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, బాధిత యువతి సెలవులకు హైదరాబాద్ వచ్చి స్నేహితులతో కలిసి మందమల్లమ్మ జంక్షన్ వద్ద ఉంటుంది. షాపింగ్ కు వెళ్లేందుకు కారులో బయలుదేరగా ఈ దారుణం జరిగింది.