శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి పల్లిలో రెండు రోజుల క్రితం హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీ, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్ది పరామర్శించారు. మంగళవారం వైయస్ జగన్ లింగమయ్య కుమారుడు మనోహర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మనోహర్ తనకు కూడా ప్రాణహాని ఉందని వైయస్ జగన్కు చెప్పుకొచ్చాడు. పార్టీ తరఫున అండగా ఉంటామని, ఏ సాయం కావాలన్నా అందిస్తామని , భయపడొద్దని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో పాపిరెడ్డిపల్లికి వస్తానని మనోహర్కు ధైర్యం కల్పించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు ఇకనైనా దాడులు ఆపాలని జగన్ పేర్కొన్నారు. పోలీసులు, టీడీపీ నేతల సమన్వయంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.