ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యం నగరంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తూ గమ్య స్థానాలకు చేరుకుంటూ ఉంటారు. అయితే ప్రయాణికుల సంఖ్యను పెంచి, నష్టాలు తగ్గించుకునేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలు చేపట్టింది. దీనికి మెట్రో టైమింగ్స్ పెంచాలని నిర్ణయించింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అమీర్పేట స్టేషన్కు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్లినా 4 వైపులకూ మెట్రోలు వెళ్లేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అయితే మెట్రో చార్జీలు కూడా త్వరలో పెంచనున్నట్లు తెలుస్తోంది.