రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన హెచ్సీయూ భూముల అంశంపై సుప్రీం కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హెచ్సీయూ రిజిస్ట్రార్కు సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు నివేదిక అందించాలని రిజిస్ట్రార్ను ఆదేశించింది. ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఆ భూములు గత మూడు దశాబ్దాలుగా వివాదంలో ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అది అటవీ భూమి అని ఆధారాలు లేవని కోర్టుకు తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని, తదుపరి ఉత్వర్వులు వచ్చే వరకు వేచి ఉండాలని కోర్టు సూచించింది.