వైసీపీ అధినేత , ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ నేడు కర్నూలు జిల్లాకు వచ్చారు. కోడుమూరు వైసీపీ నేత, కుడా మాజీ ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు వైయస్ జగన్ హాజరయ్యారు. జీఆర్సీ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు శ్రేయ, వివేకానంద విరూపాక్షలను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వైయస్ జగన్ వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు.