ప్రముఖ నటి పూజా హెగ్డే తిరుమలలో సందడి చేశారు. శుక్రవారం ఉదయం పూజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పూజా హెగ్డేను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు.