శ్రీవారి సేవ‌లో డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్

టాలీవుడ్‌ టాప్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నేడు తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. శ‌నివారం ఉద‌యం కుటుంబసభ్యుల‌తో తిరుమ‌ల‌కు చేరుకున్న నాగ్ అశ్విన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అత‌డికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు నటిని శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. నాగ్ అశ్విన్ గ‌తేడాది క‌ల్కి సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం క‌ల్కి రెండో భాగం తెర‌కెక్కించే ప‌నిలో ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *