టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఓ లేఖ రాశారు. కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 2023లోనే కరీంనగర్లో టీటీడీ ఆలయానికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2023 మే 31న కరీంనగర్లో పదెకరాల స్థలంలో భూమి పూజ జరిగిందన్నారు. రెండేళ్ల నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలిపారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని వివరించారు. ఆలయ పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపించాలని కోరారు.