ఏపీలో రోడ్డు ప్ర‌మాదం.. డిప్యూటీ క‌లెక్ట‌ర్ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్న‌మ‌య్య జిల్లాలో జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఓ డిప్యూటీ క‌లెక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయారు. సంబేపల్లె మండలంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న హంద్రీనీవా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవీ మృతి చెందారు. చిత్తూరు-కర్నూలు జాతీయ ‌రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు-రాయచోటి రహదారిలో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో ఓ కారులో ప్రయాణిస్తున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు త‌క్ష‌ణ‌మే ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందిన‌ట్లు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *