ఈ రోజుల్లో గుండె పోటులు సర్వసాధారణం అయిపోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె పోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా మహారష్ట్రలో ఓ విషాదకర ఘటన జరిగింది. స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఓ 20 ఏళ్ల యువతి అక్కడే కుప్పకూలి చనిపోయింది. మహారాష్ట్ర – ధారాశివ్ జిల్లా కళాశాలలో వీడ్కోలు సమావేశంలో ఈ ఘటన జరిగింది. బీఎస్సీ విద్యార్థిని వర్షా ఖరాత్ ప్రసంగిస్తూ కుప్పకూలింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, గుండెపోటుతో మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. కాగా, ఎనిమిదేళ్ల వయసులో వర్ష గుండెకు శస్త్ర చికిత్స జరిగిందని కుటుంబసభ్యులు తెలిపారు.