మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం తుర్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డివైడర్ అవతలివైపు నుంచి వెళ్తున్న డీసీఎంను కూడా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులను సిద్దిపేట జిల్లా వర్గల్కు చెందిన రాజు, మురారి పల్లికి చెందిన శ్రవణ్గా గుర్తించారు. కారు సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.