ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీలో ఆందోళన నెలకొంది. పవన్ ఫ్యాన్స్, జనసేన శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని తెలిపారు. మార్క్ శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. పవన్ మరికొద్ది సేపట్లో సింగపూర్ వెళ్లనున్నారు.