ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడటంపై ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. సింగపూర్లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారని తెలిసి నేను షాక్ అయ్యాను. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు వారి కుటుంబంతో ఉన్నాయి. ఆయన త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అని ఆయన పోస్టులో పేర్కొన్నారు.