చేప‌ల పులుసు వండిన నాగ‌చైత‌న్య‌

అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి జోడీగా రూపుదిద్దుకుంటున్న చిత్రం తండేల్‌. చందూ మొండేటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొడుతుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అంచ‌నాలు పెంచేస్తున్నారు. సినిమాలో నాగ‌చైన‌త్య లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉండ‌టం ఆక‌ట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఆస‌క్తిక‌ర వీడియోను సోష్‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో హీరో నాగచైతన్య షూట్ లొకేషన్‌లో చేపలపులుసు వండాడు. చైత‌న్య‌ వండిన చేపల పులుసు తిన్న వారు సూప‌ర్ గా ఉందంటూ మెచ్చుకుంటున్నారు. యేటలో చేపలు పట్టేసాక..మంచి పులుసు ఎట్టేయాలి కదా అని దీనికి క్యాప్ష‌న్ జోడించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *