నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్గా ఆహా లో స్ట్రీమ్ అవుతున్న షో అన్ స్టాపబుల్. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోకు హాజరయ్యారు. తాజాగా ఈ షోలో విక్టరీ వెంకటేష్ సందడి చేశారు. వెంకటేశ్ సోదరుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ట్రైలర్లో బాలకృష్ణ, వెంకటేశ్ మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు వెంకటేష్, సురేష్ బాబులు తమ తండ్రి రామానాయుడిని తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎపిసోడ్ ఈ నెల 27 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.