టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ కొత్త సంవత్సరం వేడుకల్ని వినూత్నంగా జరుపుకుంది. తన భర్త, నటుడు వరుణ్ తేజ్తో కలిసి మహారాష్ట్రలోని అడవుల్లో సఫారీకి వెళ్లింది. అడవి మధ్యలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోల్లో మెడా ప్రిన్సెస్ నిహారిక కూడా ఉండటం విశేషం. తిపేశ్వర్ అడవి మధ్యలో నూతన సంవత్సరం తనకు ఎంతో నేర్పిందని లావణ్య తన పోస్టులో రాసుకొచ్చింది.