టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పుష్పతో ఇటీవల బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక పుష్పతో వచ్చిన క్రేజ్తో బాలీవుడ్లో వరుస ఛాన్సులు కొట్టేస్తోంది. వరుణ్ ధావన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ జోడీగా ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్హణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చిత్రం ఛావా.
ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్తో రష్మిక నటిస్తున్న సికందర్ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే ఊపులో రష్మిక ఖాతాలో మరో క్రేజీ సినిమా వచ్చి చేరింది. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సౌత్ డైరెక్టర్ అట్లీ సల్మాన్ ఖాన్తో మరో సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక కన్ఫార్మ్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్ నుంచి వెళ్లిన రష్మిక బాలీవుడ్లో పాతుకుపోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.