తండేల్ సినిమాకు సాయిప‌ల్ల‌వికి క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్‌!

టాలీవుడ్ ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో తండేల్ ఒక‌టి.ఈ సినిమాలో అక్కినేని వార‌సుడు నాగ‌చైత‌న్య హీరోగా, స్టార్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వితో జోడీగా న‌టిస్తున్నారు. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో చాలా అంచ‌నాలున్నాయి. ఇక ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ అయితే ఈ సినిమా న‌టుల‌కు జాతీయ అవార్డులు కూడా వ‌స్తాయంటూ హైప్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి క‌లిసి ల‌వ్‌స్టోరీతో మంచి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ మ‌రో హిట్ కొట్ట‌డం గ్యారంటీ అని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తండేల్‌ ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో సాయిప‌ల్ల‌వి ఈ సినిమాకు తీసుక‌న్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త సినిమాల‌కు ఎప్పుడు తీసుకోనంత‌గా రూ.5 కోట్ల వ‌ర‌కు తీసుకున్న‌ట్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇదే నిజ‌మైతే సాయిప‌ల్ల‌వి కెరీర్‌లోనే హైయ్య‌స్స్ రెమ్యున‌రేష‌న్ తీసుకున్న సినిమాగా తండేల్ ఉంటుంద‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *