టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న సినిమాల్లో తండేల్ ఒకటి.ఈ సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా, స్టార్ హీరోయిన్ సాయిపల్లవితో జోడీగా నటిస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. ఇక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అయితే ఈ సినిమా నటులకు జాతీయ అవార్డులు కూడా వస్తాయంటూ హైప్ ఇస్తున్నారు. ఇప్పటికే నాగచైతన్య, సాయిపల్లవి కలిసి లవ్స్టోరీతో మంచి హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ మరో హిట్ కొట్టడం గ్యారంటీ అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న తండేల్ ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో సాయిపల్లవి ఈ సినిమాకు తీసుకన్న రెమ్యునరేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత సినిమాలకు ఎప్పుడు తీసుకోనంతగా రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇదే నిజమైతే సాయిపల్లవి కెరీర్లోనే హైయ్యస్స్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాగా తండేల్ ఉంటుందని సమాచారం.