ప్రస్తుతం రాష్ట్రంలో కంచ గచ్చిబౌలి భూముల వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో జేసీబీలతో ప్రభుత్వం చదును చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఆందోళనకు దిగుతున్నారు. దీనిపై ప్రముఖులంతా తమ గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ నటి సమంత ఇన్స్టా వేదికగా స్పందించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల కథనంపై ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసింది. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని పిలుపునిచ్చింది. సామాజిక సమస్యలు పరిష్కరించే ఓ సంస్థకు పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. దీనిపై ఇప్పటికే రేణు దేశాయ్, ఉపాసన కామినేని కూడా స్పందించారు.