బెట్టింగ్స్ యాప్ కేసు.. హైకోర్టుకు శ్యామ‌ల‌

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కేసు తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖ తార‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ప‌లువురు సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌న‌పై కూడా కేసు న‌మోదైన నేప‌థ్యంలో యాంక‌ర్ శ్యామ‌ల తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. బెట్టింగ్ యాప్‌ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *