ఒకే స్టేజీపై అబ్బాయ్‌.. బాబాయ్‌..!

టాలీవుడ్‌ మ‌రో భారీ ఈవెంట్‌కు సిద్ధ‌మైంది. మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాం చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజ‌మండ్రిలో జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్త‌య్యాయి. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజ‌రు కానున్నారు. ఈ ఈవెంట్‌కు దాదాపు ల‌క్ష మంది మెగా అభిమానులు హాజ‌ర‌వుతార‌ని అంచ‌నా వేస్తున్నారు. రాం చర‌ణ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌నున్న నేప‌థ్యంతో పాటు, ప‌వ‌న్ డిప్యూటీ సీఎం హోదాలో ఓ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అవుతున్నందున‌ ఈ ఈవెంట్ రికార్డు సృష్టించ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న గేమ్ చేంజ‌ర్‌పై భారీ అంచ‌నాలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *