తండేల్ మేకర్స్ కు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీలో తండేల్ సినిమా టికెట్ల ధర పెంపునకు సర్కార్ అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 పెంచుకునేందుకు అనుమతించింది. సినిమా విడుదల రోజు నుంచి ఏడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.