నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డాకు మహారాజ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించినట్లు తెలుస్తోంది. ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో నేడు జరగాల్సి ఉంది. అయితే మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్స్ క్యూలైన్లలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశారు.