రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన టాల్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మొదటి సినిమా అంత హిట్ అవ్వకపోయినా భాగ్యశ్రీకి మాత్రం మంచి పేరే వచ్చింది. ఈ గ్లామర్ బ్యూటీకి ఆ తర్వాత సినిమా ఛాన్సులు కూడా క్యూ కట్టాయి. ఇప్పటికే రామ్, విజయ్ దేవరకొండ, దుల్కార్ సల్మాన్లతో వరుస సినిమాలు చేస్తోంది. తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది భాగ్యశ్రీ. హనుమాన్ మూవీతో హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ప్రభాస్తో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనక నిజమైతే భాగ్యశ్రీ కెరీర్ టర్న్ అయినట్టే. దీనిపై త్వరతో అధికారిక ప్రటకన రానుందని టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.