బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంగ‌నా

బాలీవుడ్ న‌టి, బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్ అటు సినిమాలు, ఇటు రాజ‌కీయంలో స‌క్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఇక తాజాగా ఈ అమ్మ‌డు మ‌రో రంగంలో అడుగుపెట్టింది. వ్యాపారం మొద‌లెట్టానంటూ ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు పెట్టి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. ఫుడ్‌ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు కంగ‌నా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ది మౌంటైన్‌ స్టోరీ’ పేరుతో హిమాలయాల్లో కేఫ్‌ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 14న దీన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ మేరకు రెస్టారెంట్‌ ఫొటోలను త‌న అభిమానుల‌తో పంచుకున్నారు. చిన్ననాటి కల నెర‌వేరింది. హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్… అంటూ ఫొటోల‌ను పోస్టు చేశారు. మ‌రి వ్యాపార రంగంలో కంగ‌నా ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *