స్టార్ డైరెక్టర్ రాజమౌళి- ప్రిన్స్ మహేష్బాబు కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా మూవీ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రియాంకా సోషల్ మీడియాలో చాలా హైప్ క్రియేట్ చేస్తోంది.తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఓ వీడియో లీక్ అయ్యింది. ఇక ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. తాజాగా ప్రియాంకా చోప్రా ఈ మూవీ షూటింగ్ సెట్లో అడుగు పెట్టింది. ఈ విషయాన్ని ప్రియాంకా తన ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.