తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన తారలకు ఉచ్చు బిగుస్తోంది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు సైతం తీసుకున్న ఘటనలు ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఆదేశాలతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లపై కేసులు నమోదు చేసి విచారణకు పిలుస్తున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన మరికొందరు స్టార్ యాక్టర్లపై కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆరోపణలతో నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ తో సహా మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్లపై మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.