మా తాత ర‌సికుడు… మెగాస్టార్ కామెంట్స్ వైర‌ల్

మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లకు ద‌గ్గ‌ర‌వుతున్నా ఇంకా యంగ్ హీరోల‌కు పోటీగా సినిమాలు తీస్తున్నారు. గ్లామ‌ర్‌లోనూ, డ్యాన్స్ లోనూ ఎవ్వ‌రికీ ఏం త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్నారు. మంగ‌ళ‌వారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘బ్రహ్మ ఆనందం’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. చిరంజీవి వాళ్ల తాత గురించి మాట్లాడుతూ.. ఆయన ర‌సికుడ‌ని, ఇంట్లో ఇద్ద‌రు అమ్మ‌మ్మ‌లు ఉండే వాళ్ల‌ని చెప్పారు. వాళ్ల‌తో ఇంట్లో గొడ‌వ జ‌రిగితే బ‌య‌ట ఇంకో ఆమె ఉండేద‌ని చెప్పారు. ఆయ‌న బుద్దులు మాత్రం త‌మ‌కు రావొద్ద‌ని వాళ్ల అమ్మ చెప్పేద‌న్నారు. అలాగే మ‌న‌వ‌రాళ్ల‌తో ఇంట్లో ఎలా ఉంటుంద‌ని యాంక‌ర్ సుమ చిరంజీవిని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానంగా చిరంజీవి మాట్లాడుతూ… ఇంట్లో ఉన్న‌ప్పుడు మ‌న‌వ‌రాళ్ల‌తో ఉన్న‌ట్లు ఉండ‌ద‌ని, లేడీస్ హాస్ట‌ల్ వార్డెన్ లాగా ఉంటుంద‌ని అన్నారు. చుట్టు ఆడ‌పిల్ల‌లే ఉంటార‌ని, ఒక్క మ‌గ‌పిల్లాడు కూడా లేర‌న్నారు. చ‌ర‌ణ్‌ను ఈసారైనా ఇంకొక అబ్బాయిని క‌న‌రా, మ‌నం మ‌న లెగ‌సీని కంటిన్యూ చేయాల‌ని చెబుతుంట‌ అన్నారు. చ‌ర‌ణ్ ఇంకో అమ్మాయిని ఎక్క‌డ కంటాడో అని భ‌య‌ప‌డుతుంటాన‌ని చెప్పారు. ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అమ్మాయిల‌పై ఎందుకంత చుల‌క‌న భావం అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *