తమిళ్ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తమ వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పటికే కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశాయి. అయితే ఈ మధ్య ఈ జంట మళ్లీ కలవబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఐశ్వర్య, ధనుష్ నవంబర్ 21న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. అక్కడ వారు విడిపోవాలనే కోరుకుంటున్నట్టు న్యాయస్థానం ముందు వ్యక్తం చేశారు. విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణను నవంబర్ 27కి వాయిదా వేశారు. నేడు వీరి కేసులో తుది తీర్పు వెల్లడిస్తూ వీరికి విడాకులు మంజూరు చేసింది. ధనుష్, ఐశ్వర్య 2004లో వివాహం జరిగింది. 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో విడిపోవాలని నిర్ణయించి ఉమ్మడిగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు.