ధూం ధాం టీజ‌ర్ రిలీజ్ చేసిన డైరెక్ట‌ర్ మారుతి

ప్ర‌భాస్ రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న డైరెక్ట‌ర్ మారుతి టైం దొరికితే అడ‌పాద‌డ‌పా సినీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతూ ఫ్యాన్స్ ను అల‌రిస్తున్నారు. ఇటీవ‌ల రాజా సాబ్ నుంచి ప్ర‌భాస్ స్టిల్ రిలీజ్ చేసి అంద‌రికీ షాకిచ్చారు. అప్పుడ‌ప్పుడూ రాజా సాబ్ అప్‌డేట్స్ ఇస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. తాజాగా మారుతి ఓ మూవీ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్నారు. అదే చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “ధూం ధాం”. ఈ మూవీలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ వంటి సీనియ‌ర్ న‌టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చా డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాకు రూప‌ గోపీ మోహన్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నవంబర్ 8న ఈ సినిమా విడుద‌ల కానుంది. డైరెక్టర్ మారుతి “ధూం ధాం” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీం కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా రిలీజ్ కానుంది.

 


		

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *